
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం జరిగే బీజేపీ జనసభకు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ దామి హాజరు కానున్నారని బీజేపీ స్టేట్ లీడర్, మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్రావు తెలిపారు. ఆదివారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ జన సభలో ప్రజలు, బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాల్సిందిగా కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు కంభంపాటి ప్రతాప్, గోగుల రాణాప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.