ఎయిర్ ఇండియాలో ఇంజినీర్స్ పోస్టులకు ప్రకటన

ఎయిర్ ఇండియాలో ఇంజినీర్స్ పోస్టులకు ప్రకటన

ఎయిర్ ఇండియాకి చెందిన హైద‌‌రాబాద్లోని సెంట్రల్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్‌‌మెంట్‌‌, కాంట్రాక్టు ప్రాతిప‌‌దిక‌‌న‌‌ 26 ట్రైనీ ఫ్లైట్ సిమ్యులేట‌‌ర్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఎంపికయిన వారు ముంబై, హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హత‌‌: ఎలక్ర్టానిక్స్/ఎలక్ర్టికల్/కంప్యూటర్ సైన్స్/టెలికమ్యూనికేషన్/ఇన్స్ర్టుమెంటేషన్‌‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత‌‌.

వయసు: 30 ఏళ్లకుమించరాదు.

చివ‌‌రితేది: 2019 ఆగస్టు 20;

వివరాలకు: www.airindia.in