
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్పూర్తిచేయడమే లక్ష్యంగా వ్యాక్సిన్ వెహికల్స్ ను ప్రారంభించినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు. జిల్లాలో రొటీన్ ఇమ్యునైజేషన్ సెషన్స్ నిర్వహించడానికి, ఇరుకు గల్లీలను ఈజీగా చేరుకోవడానికి ఏఎన్ఎంలకు నాలుగు వ్యాక్సిన్ వెహికల్స్ కేటాయించినట్లు చెప్పారు. శనివారం సికింద్రాబాద్లోని ఆఫీసులో జెండా ఊపి వాటిని ప్రారంభించారు.
ఖైరతాబాద్, మెట్టుగూడ, శ్రీరామ్నగర్, సనత్ నగర్ యూపీహెచ్సీలకు వెహికల్స్కేటాయించినట్లు తెలిపారు. జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, మాస్ ఎడ్యుకేషన్, మీడియా అధికారి జక్కుల రాములు పాల్గొన్నారు.