
పటేల్.. బాంబే ప్రెసిడెన్సీలోని గుజరాత్లో గల నడియాడ్లో 1875 అక్టోబర్ 31న జన్మించారు. బొంబాయిలో 1950 డిసెంబర్ 15న మరణించారు. వల్లభాయ్ పటేల్ న్యాయవృత్తి నిర్వర్తించారు.
బిరుదులు
సర్ధార్ (బార్దోలి సత్యాగ్రహ సమయంలో), భారతదేశ ఉక్కు మనిషి . ఇండియన్ బిస్మార్క్, ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ ఇండియా సివిల్ సర్వెంట్స్
ఇతను రాసిన గ్రంథాలు, ఐడియాస్ ఆఫ్ నేషన్ (ఇంగ్లీష్), భారత్ విభజన్ (హిందీ)
సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య భారతదేశ మొదటి హోంమంత్రి, ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారు. పటేల్ జన్మదినమైన అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్గా 2014 నుంచి జరుపుతున్నారు. ఈయన గుర్తింపుగా కెవడియా వద్ద నర్మదా నదిపై సర్ధార్ సరోవర్ డ్యాం దగ్గర విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్మించింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఉంది.
మూడు జాతీయ పార్టీల హోదా రద్దు
దేశంలో జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐల జాతీయ హోదాను ఈసీ ఉపసంహరించుకుంది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు జాతీయ హోదా ఉంది. ఓ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే లోక్సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లైనా వచ్చి ఉండాలి. నాలుగు ఎంపీ సీట్లను సైతం గెలవాలి. లేదా లోక్సభ సాధారణ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో 2శాతం స్థానాల్లో విజయం సాధించాలి.