
- ఆ సినిమా నిర్మాత , డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలి
- నవోదయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ పటేల్ డిమాండ్
బషీర్బాగ్, వెలుగు: ఓదెల–2 సినిమాలో వంశరాజ్(పిచ్చకుంట్ల) కులాన్ని కించపిరిచేలా డైలాగులు ఉన్నాయని, తక్షణమే ఆ సినిమా నిర్మాత, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని నవోదయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్ పటేల్, తెలంగాణ రాష్ట్ర వంశరాజ్ సంక్షేమ సంఘం సభ్యుడు మల్లేశ్డిమాండ్ చేశారు. పిచ్చకుంట్ల కులస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాత మధు, దర్శకుడు అశోక్ తేజపై ఇటీవల అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తక్షణమే వారిపైన చర్యలు తీసుకుని ఆ సినిమాలో పిచ్చకుంట్ల వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశారు.