![వేగం పెంచిన వందే భారత్ ఎక్స్ప్రెస్](https://static.v6velugu.com/uploads/2023/12/vande-bharat-express-increased-speed_z8IFfQVBXt.jpg)
సికింద్రాబాద్, వెలుగు: కాచిగూడ-– యశ్వంతపూర్ మార్గంలో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ స్పీడ్ను రైల్వే అధికారులు మరింత పెంచారు. దీంతో రైలు వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంతకుముందు 8.30 గంటల ప్రయాణ సమయం తీసుకున్న రైలు 15 నిమిషాల మేర వేగాన్ని పెంచారు. దీంతో రెండు రూట్లలో ప్రయాణం ఇప్పుడు 8 గంటల 15 నిమిషాల వ్యవధిలో గమ్య స్థానం చేరుకోనుంది. ఇప్పటి వరకు కాచిగూడ నుంచి 5.30 గంటలకు బయలు దేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకునే ఈ రైలు ఇక నుంచి 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్పూర్ చేరుకుంటుంది.