16 నుంచి రామగుండానికి వందేభారత్​ ట్రైన్​ సేవలు

16 నుంచి రామగుండానికి వందేభారత్​ ట్రైన్​ సేవలు

గోదావరిఖని, వెలుగు:  వందేభారత్​ట్రైన్​సేవలు ఈ నెల16 నుంచి రామగుండం ప్రాంత ప్రయాణికులకు అందనున్నాయి.  నాగ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉదయం ఐదు గంటలకు బయలు దేరే ఈ ట్రైన్​ సేవాగ్రామ్​, చంద్రాపూర్​, బల్లర్షా తర్వాత రామగుండంకు ఉదయం 9.08 గంటలకు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి కాజీపేట మీదుగా సికింద్రాబాద్​కు మధ్యాహ్నం 12.15కు చేరుతుంది. 

తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒంటిగంటకు సికింద్రాబాద్​లో బయలుదేరే ఈ ట్రైన్​ రామగుండంకు మధ్యాహ్నం 3.30 గంటలకు, చివరి స్టేషన్​నాగ్​పూర్​కు రాత్రి 8.20 గంటలకు చేరుతుంది. ఈ వందేభారత్​ ట్రైన్​ మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు నడుస్తుంది. 

 నాగ్​పూర్​ నుంచి రామగుండంకు నాలుగు గంటలు, రామగుండం నుంచి సికింద్రాబాద్​కు రెండు గంటల 13 నిమిషాలలో చేరుకోవచ్చని, ఈ సౌకర్యాన్ని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని రైల్వే డీఆర్​యూసీసీసీ మాజీ మెంబర్​ క్యాతం వెంకటరమణ కోరారు.