పశువుల వింత వ్యాధికి విరుగుడు కరువు!

పశువుల వింత వ్యాధికి విరుగుడు కరువు!

కమలాపూర్, వెలుగు​ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి, పంగిడిపల్లి గ్రామాల్లో పశువులకు వింత వ్యాధి సోకి మృత్యువాత పడుతున్నాయి. వ్యాధికి కారణాలను తెలుసుకోవడంలో వెటర్నరీ డాక్టర్లు విఫలమవుతున్నారు. 

ఇప్పటికే పదుల సంఖ్యలో పశువులు చనిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, విచారణ చేపట్టి పశువులను కాపాడాలని కోరుతున్నారు. కోల్పోయిన పశువులకు నష్టపరిహారం అందించి, ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.