
గుజరాత్లోని రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ గ్రీన్బెల్ట్లోని 3000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 200 జాతులు, 1.5 లక్షలకుపైగా వన్యప్రాణులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వంతారా(స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్) వన్యప్రాణుల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనిని రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాయి.
వంతారా ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ అడవి.
అంతరించిపోతున్న జంతువులను సంరక్షించడం, గాయపడిన, ప్రమాదంలో చిక్కుకున్న వన్యప్రాణులను కాపాడి, చికిత్స చేసి, సంరక్షించి, పునరావాసం కల్పించడం.
వన్యప్రాణుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు హాస్పిటల్లో వైల్డ్లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ తదితర జంతు వైద్య వసతులను కల్పించడం.
ఇందులో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ ఉన్నది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో వంతారాను నిర్వహిస్తున్నారు.