PM Modi: ప్రధాని మోదీని తన పెళ్ళికి ఆహ్వానించిన వరలక్ష్మి శరత్ కుమార్

PM Modi: ప్రధాని మోదీని తన పెళ్ళికి ఆహ్వానించిన వరలక్ష్మి శరత్ కుమార్

నటుడు శరత్ కుమార్ కూతురు, తమిళ నటి వలక్ష్మి శరత్ కుమార్ త్వరలో ప్రేళ్లిచేసుకోబోతున్న విషయం తెలిసిందే. ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ తో ఆమె ఏడడుగులు వేయనుంది. అయితే.. వరలక్ష్మి పెళ్లి చాలా సింపుల్ గా జరుగనున్నా.. రెసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

ఈ రెసెప్షన్ కోసం ఇండియా లెవల్లో స్టార్స్ అందరికీ ఆహ్వానాలు అందుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందించారు. శరత్ కుమార్ ఫ్యామిలీ అంతా కలిసి ఇటీవల మోడీకి ఆహ్వానాన్ని అందించారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు వరలక్ష్మి శరత్ కుమార్. 

భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ అద్భుతమైన స్వాగతానికి ధన్యవాదాలు. మీ బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం సమయాన్ని కేటాయించారు. అందుకు మాకు చాలా గౌరవంగా ఉంది. మోదీ గారిని కలిసేలా చేసినందుకు నాన్న మీకు కృతజ్ఞతలు.. అంటూ రాసుకొచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.