వరుణ ద్వైపాక్షిక విన్యాసాలు

వరుణ ద్వైపాక్షిక విన్యాసాలు

22వ ఇండో ఫ్రెంచ్​వరుణ ద్వైపాక్షిక నావికా విన్యాసాలు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్​ 1 వరకు ఫ్రాన్స్‎లోని టౌలాన్​లో జరిగాయి. మధ్యదరా సముద్రంలో జరిగిన నావికా విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్​లైన్​ యుద్ధ నౌక ఐఎన్​ఎస్​ తబర్ పాల్గొన్నది. భారత నావికాదళం తరఫున హెలికాప్టర్ ఎల్​ఆర్​ఎంఆర్​ ఎయిర్​క్రాఫ్ట్​ పీబీఐ ప్రాతినిధ్యం వహించింది.

అయితే, ఫ్రాన్స్​ తరఫున ఎఫ్​ఎస్​ ప్రోవెన్స్, సబ్​మెరైన్​ సఫ్రెన్, ఎయిర్​ క్రాఫ్ట్​ ఎఫ్​20, అట్లాంటిక్​ 2, ఫైటర్స్​ ఎంబీ330, హెలికాప్టర్లు ఎన్​హెచ్​90, డౌఫిన్​ ప్రాతినిధ్యం వహించాయి. భారత్, ఫ్రాన్స్ మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి 2001లో ద్వైపాక్షిక విన్యాసాలు వరుణ ప్రారంభమైంది.