![లక్డీకాపూల్లోని వాసవి ఆసుపత్రిలో దారుణం.. ఉద్యోగి అనుమానస్పద మృతి](https://static.v6velugu.com/uploads/2024/06/vasavi-hospital-employee-life-ends-in-suspiciousjpg2_jrUfCn49Xa.jpg)
లక్డీకాపూల్లోని వాసవి ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆ ఆసుపత్రిలో పనిచేసే కనకారెడ్డి అనుమానస్పదంగా మృతి చెందాడు. ఆసుపత్రిలో క్యాథ్ల్యాబ్ టెక్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న కనకారెడ్డి నిన్న( జూన్ 28)వ తేదీన తాగి వచ్చాడని అతన్ని కొట్టి, అందరి ముందు అవమానపరిచాడు ఇన్ఛార్జి శాంతి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన కనకారెడ్డి ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున చూసేసరికి అనుమానస్పదంగా మృతి చెంది ఉన్నాడు. ఆస్పత్రి ఇన్ఛార్జి కొట్టడం వల్లే చనిపోయాడని మృతుడి బంధువుల, భార్య, పిల్లలు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. అయితే ఇంట్లో చనిపోయినందున తమకు సంబంధం లేదన్న ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. ఆసుపత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే కనకారెడ్డిని ఆసుపత్రి నుండి పంపించామని, అతనికి ఏమి జరిగినా తమకు సంబంధం లేదంటూ నిన్ననే అతని భార్యకు మెసేజ్ చేశామని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది.