
ముషీరాబాద్, వెలుగు: పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని విముక్త చిరుతల కచ్చి(వీసీకే) రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్ పేర్కొన్నారు. కేంద్రం దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్కేటాయించాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘దక్షిణాది పార్లమెంట్సీట్లు పెంపు.. దక్షిణాది హక్కు’ అంశంపై వీసీకే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
వీసీకే తెలుగు రాష్ట్రాల ఇన్చార్జ్బాలసింగం, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, సీపీఎం రాష్ట్ర నేత నరసింహరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి రవి, బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షుడు నల్ల సూర్యప్రకాశ్, జిలుకర శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ ఎస్ ‘హిందీ, హిందూ, హిందూస్థాన్’ అనే నినాదాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. జనాభా నియంత్రణ, పార్లమెంట్స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ను దేశ రెండో రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర్ప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరారు.