200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌‌‌‌తో దూసుకుపోతోన్న..ఓటీటీ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్

200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌‌‌‌తో దూసుకుపోతోన్న..ఓటీటీ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్

నరేష్, రాగ్‌‌‌‌ మయూర్‌‌‌‌, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్‌‌‌‌లో  నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్‌‌‌‌ పలుట్ల దర్శకత్వంలో  బాపినీడు. బి, సుధీర్‌‌‌‌ ఈదర నిర్మించారు. ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రానికి రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్, వాచ్ టైంతో బిగ్గెస్ట్ హిట్ అయ్యిందని టీమ్ తెలియజేసింది.

ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌‌‌‌మీట్‌‌‌‌లో నరేష్​ మాట్లాడుతూ ‘200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌‌‌‌తో ఈ సినిమా దూసుకుపోతోంది. ఇది ప్రేక్షకుల విజయం. ఇదొక ఎమోషనల్ ట్రావెల్. ఈ సినిమా జ్ఞాపకాలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను’ అని అన్నాడు.

ఇది ఆర్గానిక్ సక్సెస్ అన్నాడు రామ్ మయూర్. ఈ విజయం ఆనందాన్ని ఇచ్చిందని ప్రియా వడ్లమాని, డైరెక్టర్ అనురాగ్ అన్నారు. దర్శకులు నంద కిషోర్, సతీష్ వేగేశ్న, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి 
పాల్గొన్నారు.