బిట్​ బ్యాంక్​: తెలంగాణ నైసర్గిక స్వరూపం

బిట్​ బ్యాంక్​: తెలంగాణ నైసర్గిక స్వరూపం
  •     అనంత పద్మనాభస్వామి ఆలయం అనంతగిరి గుట్టలలో విస్తరించి ఉంది. 
  •     మహబూబ్​నగర్​లో షాబాద్​ గుట్టలు, కోయిల్​ గుట్టలు విస్తరించి ఉన్నాయి.
  •     శ్రీపర్వతం నల్లగొండ జిల్లాలో విస్తరించి ఉంది. 
  •     అనంతగిరి గుట్టలు వికారాబాద్​ జిల్లాలో ఉన్నాయి. 
  •     కెరామెరీ ఘాట్స్​ ఆసిఫాబాద్​ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. 
  •     రాయగిరి గుట్టలు భువనగిరి జిల్లాలో ఉన్నాయి. 
  •     రాఖీగుట్టలు జగిత్యాల జిల్లాలో విస్తరించి ఉన్నాయి. 
  •     నాగర్​కర్నూల్​ జిల్లాలో విస్తరించి ఉన్న తూర్పు కనుమలను నల్లమల కొండలు అని పిలుస్తారు. 
  •     యల్లండ్లపాడు గుట్టలు ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నాయి. 
  •     కందికల్​ గుట్టలు మహబూబాబాద్​ జిల్లాలో విస్తరించి ఉన్నాయి. 
  •     సిర్పూర్​ గుట్టలు ఆసిఫాబాద్​ జిల్లాలో ఉన్నాయి.
  •     ఫతేమైదాన్​ (విజయ మైదానం) ప్రాంతంలో ఎల్బీ స్టేడియం నిర్మించారు. 
  •     తెలంగాణలోని పశ్చిమ కనుమలలో ఎత్తయిన శిఖరం మహబూబ్​ఘాట్స్​.
  •     రాయగిరి కోట తూర్పుకనుమలలో ఉంది. 
  •     కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం రాఖీగుట్టలలో విస్తరించి ఉంది. 
  •     గోల్కొండను గొల్లకొండ అని పిలిచేవారు.
  •     హథియా వృక్షం/ ఏనుగు చెట్టు గోల్కొండ కొండల్లో ఉంది. 
  •     పాండవుల గుట్టలు భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి.
  •     కోయిల్​ గుట్టలు మహబూబ్​నగర్ జిల్లాలో ఉన్నాయి. 
  •     రాతిగుట్టలు కామారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
  •     రాజు గుట్టలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి.
  •     షాబాద్​ గుట్టలు మహబూబ్​బాద్​ జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
  •     ఇనుముకొండలు ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
  •     కామారెడ్డి, భూపాలపల్లి, పెద్దపల్లి, నిర్మల్​ జిల్లాల్లో పశ్చిమ కనుమల పంక్తులు విస్తరించి ఉన్నాయి.
  •     తూర్పు కనుమలను మమబూబ్​నగర్ జిల్లాలో తూర్పు కొండలుగా పిలుస్తారు. 
  •     తెలంగాణలోని తూర్పు కనుమల్లో ఎత్తయిన కొండ లక్ష్మీదేవి పల్లి సిద్దిపేట జిల్లాలో ఉంది.
  •     కృష్ణా– దిండి నదుల మధ్య ప్రీక్యాంబ్రియన్​ శిలలు విస్తరించి ఉన్నాయి. 
  •     బసాల్టు శిలలతో ఏర్పడిన ప్రాచీన కోత మైదానాలు రాష్ట్రంలో రంగారెడ్డి, గద్వాల్​, సంగారెడ్డి జిల్లాలో విస్తరించి ఉన్నాయి.
  •     గోదావరి నది ఏర్పరిచే బైసన్​ గార్జ్​ పాపికొండల్లో విస్తరించి ఉంది. 
  •     గోదావరి పరీవాహక ప్రాంతంలో లభించే అతి ముఖ్యమైన ఖనిజం నేల బొగ్గు.
  •  అతిపురాతన దర్వార్ శిలలు కర్ణాటక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. 
  •     తెలంగాణలో గోండ్వానా శిలలు నేలబొగ్గుకు ప్రసిద్ధి.
  •     హసన్​పర్తి కొండలు హనుమకొండ జిల్లాలో ఉన్నాయి.
  •     అమలుకొండ శ్రేణులు సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. 
  •     నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలు ఆర్కియన్​ శిలలతో విస్తరించి ఉన్నాయి.
  •     నిజామాబాద్​ జిల్లాలోని భీమ్​గల్​ ప్రాంతం ప్లీస్టోసీన్​ రకమైన శిలలతో నిర్మితమై ఉంది.
  •     ఆదిలాబాద్​ జిల్లా మెసోజయిక్​ శిలలతో ఏర్పడి ఉంది.
  •     ఆసిఫాబాద్​ జిల్లాలో క్రెటాసియస్​ శిలలు ఉన్నాయి.
  •     మహబూబ్​ఘాట్స్​ నిర్మల్​ జిల్లాలో ఉన్నాయి.
  •     తెలంగాణ పీఠభూమిలో విస్తరించి ఉన్న కడప శిలల్లో ఉన్న ప్రధాన ఖనిజం సున్నపురాయి.
  •     తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ల్లో విస్తరించి ఉన్న తూర్పు కనుమలకు కడప శ్రేణులని మరోపేరు.
  •     దోమకొండ కామారెడ్డి జిల్లాలో ఉంది. 
  •     కొండరెడ్లు ప్రధానంగా ఖమ్మం జిల్లాలో ఉన్నారు.
  •     తెలంగాణలో అత్యంత ఎత్తయిన జలపాతం కుంతాల.
  •     సప్తగుండాల జలపాతం ఆదిలాబాద్​ జిల్లాలో ఉంది.
  •     బోగతా జలపాతం ములుగు జిల్లాలో ఉంది.
  •     తెలంగాణ నయాగరా అని బోగతా జలపాతాన్ని పిలుస్తారు. 
  •     సవతుల గుండం జలపాతం ఆసిఫాబాద్​ జిల్లాలో ఉంది.
  •     లక్నవరం సరస్సు భూపాలపల్లి జిల్లాలో ఉంది.
  •     రథంగట్టు జలపాతం కొత్తగూడెం ప్రాంతంలోని మణుగూరులో ఉంది. 
  •     గాయత్రి/ గాడిద గుండం/ ముక్తిగుండం జలపాతం ఆదిలాబాద్​ జిల్లాలో ఉంది.
  •     చింతామణి జలపాతం భూపాలపల్లి జిల్లాలో ఉంది.
  •     మల్లెల తీర్థం నాగర్​కర్నూల్​ జిల్లాలో ఉంది. 
  •     గుండాల జలపాతం వనపర్తి జిల్లాలో ఉంది.
  •     సలేశ్వరం జలపాతం నాగర్​కర్నూల్​ జిల్లాలో ఉంది.
  •     గిడ్డలసిరి జలపాతం ఆదిలాబాద్​ జిల్లాలో ఉంది.