
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం హుండీ గురువారం (మార్చి6) లెక్కించారు. 14 రోజులకు రాజన్న హుండీ ఆదాయం రూ. 2కోట్ల 31లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ఆలయ ఓపెన్ స్లాబ్ లో పోలీసు భద్రత నడుమ అధికారులు, సిబ్బంది హుండీ ఆదాయం లెక్కించారు.
రూ. 2కోట్ల 31లక్షల 65వేలు నగదు, 201గ్రాముల బంగారం, 16కిలోల 200గ్రాము వెండిని స్వామివారికి కానుకగా భక్తులు సమర్పించినట్లీ అధికారులు తెలిపారు. ఏసీ ఆఫీసు పరిశీలకులు సత్యనా రాయణ, ఏఈఓలు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, శివ రామకృష్ణ భజన మండలి సభ్యులు ఉన్నారు.