
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామికి హుండీ ఆదాయం రూ. 2.31 కోట్లు వచ్చిందని ఆలయ ఈవో వినోద్రెడ్డి తెలిపారు. 14 రోజుల హుండీ ఆదాయాన్ని ఆలయ ఈవో పర్యవేక్షణలో గురువారం ఓపెన్ స్లాబ్లో లెక్కించారు.
ఆలయ ఖజానాకు రూ. 2 ,31,65,333 నగదు, 201 గ్రాముల బంగారం, 16,200 కిలోల వెండి సమకూరినట్లు చెప్పారు. ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించగా సేవా సమితి సభ్యులు, అధికారులు, సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.