
పరకాల, వెలుగు: ఆసరా పింఛన్లు, ఉపాధి హామీ చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడి రూ. లక్షల్లో కాజేసిన హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్బీపీఎంను విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటాపూర్బీపీఎం బి.నవీన్కుమార్ గ్రామానికి చెందిన కొందరు చనిపోగా పింఛన్లు, ఉపాధిహామీ పేమెంట్లను గ్రామ కార్యదర్శికి తెలియకుండా సుమారు రూ.6 లక్షలు కాజేశాడు. విచారణలో తేలడంతో అమౌంట్రికవరీ చేసి విధుల నుంచి తొలగించి కేసు నమోదుకు పరకాల సీఐ క్రాంతికుమార్కు సోమవారం ఫిర్యాదు చేసినట్లు పరకాల ఏఎస్పీ అనంతరామ్నాయక్ తెలిపారు. తపాలాశాఖలో అవినీతికి పాల్పడితే క్షమించేది లేదని ఆయన హెచ్చరించారు.