
వెంకటాపురం, వెలుగు : మద్యం తాగి ఇసుక లారీలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం ఎస్సై రేఖ అశోక్ హెచ్చరించారు. ఆదివారం మండల పరిధిలోని వీరభద్రవరం గ్రామం వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లారీలను వేగంగా డ్రైవ్ చేయడం, వాహనాలకు ఇబ్బంది కలిగేలా ఓవర్టేక్ చేయకూడదని హెచ్చరించారు.