టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నసినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభమైంది. కాగా ఈ సినిమా ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఫ్యామిలీ & ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా బ్యూటీఫుల్ హీరోయిన్లు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.
అయితే చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకి సంబంధిచిన కీలక అప్డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా వెంకీ-అనిల్ రావిపూడి సినిమా దాదాపుగా 90% శాతం షూటింగ్ పూర్తయిందని అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం డబ్బింగ్ మొదలైందని త్వరలోనే ట్రైలర్ అలాగే టైటిల్ కి సంబంధించిన అప్డేట్ ఇస్తామని ఎక్స్ లో ట్వీట్ చేశారు. అలాగే వెనకటేశ్ డబ్బింగ్ చెబుతున్న వీడియో కూడా షేర్ చేశారు. దీంతో హీరో వెంకటేష్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వచ్చేఏడాది మరోసారి వెంకటేష్ సంక్రాంతి బరిలో దిగబోతున్నాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ ఏడాది ఆరంభంలో ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో వెంకటేష్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని అలరించలేకపోయింది. ఇక గతంలో వెంకటేష్ తో అనిల్ రావిపూడి తీసిన ఎఫ్ 2, ఎఫ్3 చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడవ సినిమాపై ఆసక్తి నెలకొంది.
#SVC58 DUBBING BEGINS 🎙️
— Sri Venkateswara Creations (@SVC_official) October 27, 2024
Team #VenkyAnil3 completed 90% of the shoot and post-production happening in full swing to entertain you all on the big screens 💥💥💥
TITLE & FIRST LOOK SOON ❤️🔥
Victory @VenkyMama @AnilRavipudi @Meenakshiioffl @aishu_dil #DilRaju #Shirish… pic.twitter.com/BnEn2lPu2P