![కామారెడ్డి జిల్లాలో బర్డ్ఫ్లూ బార్డర్ దాటి రావొద్దు](https://static.v6velugu.com/uploads/2025/02/veterinary-doctors-team-inspecting-chickens-in-poultry-farm_H5nOS8GK6v.jpg)
- పౌల్ట్రీ రైతులు, సిబ్బందికి డాక్టర్లతో అవగాహన
- కామారెడ్డి జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రబలకుండా ముందస్తు చర్యలు
- పౌల్ట్రీల్లోని కోళ్లను పరిశీలిస్తున్న వెటర్నరీ డాక్టర్స్ టీమ్
- మహారాష్ట్ర బార్డర్లో చెక్పోస్టు ఏర్పాటు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో బర్డ్ప్లూ ప్రబలకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బర్డ్ఫ్లూ ప్రబలుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం నివారణ చర్యలపై దృష్టి సారించింది. పౌల్ర్టీ రైతులకు, వెటర్నరీ డాక్టర్లు, సిబ్బందిపై వ్యాధులు, నివారణపై అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లాలో 304 పౌల్ర్టీలు ఉండగా ఇందులో 41 లేయర్ కోళ్ల ఫారాలు, 263 బాయిలర్ పౌల్ర్టీలు ఉన్నాయి. వీటిలో14 లక్షల కోళ్లు ఉన్నాయి. భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, పాల్వంచ, రామారెడ్డి, రాజంపేట మండలాల్లో పెద్ద పౌల్ర్టీ ఫారాలు ఉండగా మిగతా మండలాల్లో చిన్నవి ఉన్నాయి.
ఇటీవల మహారాష్ర్ట, ఛత్తీస్ గఢ్ స్టేట్స్లో కోళ్లకు బర్డ్ ప్లూ వ్యాపించినట్లు వెటర్నరీ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి వైరస్ రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని వెటర్నరీ ఉన్నతాధికారులు ఇక్కడి ఆఫీసర్లకు సూచించారు. జిల్లాలో 3 రోజుల క్రితం రైతులు, వెటర్నరీ డాక్టర్లు, సిబ్బందికి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయగా.. కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ వారికి పలు సూచనలు చేశారు. మహారాష్ర్ట బార్డర్లో చెక్పోస్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పౌల్ర్టీల పరిశీలనకు టీమ్స్
పౌల్ర్టీ ఫారాలను పరిశీలించేందుకు వెటర్నరీ శాఖ టీమ్స్ను ఏర్పాటు చేసింది. వెటర్నరీ డాక్టర్, సిబ్బంది వెళ్లి తమ పరిధిలోని పౌల్ర్టీలను పరిశీలిస్తున్నారు. కోళ్లకు వైరస్ సోకిందా లేదా అనే వివరాలు సేకరిస్తున్నారు. వైరస్ రాకుండా షెడ్ల వద్ద తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి వివరిస్తున్నారు. . ఒకవేళ కోళ్లు చనిపోతే వాటిని దూరంగా పూడ్చి పెట్టాలని సూచిస్తున్నారు. చికెన్ ఎక్కువగా అమ్మే టౌన్లలో తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా మున్సిపల్అధికారులను అలర్టు చేశారు. చికెన్ వ్యర్థాలను నివాసాలకు దూరంగా పడేసేలా చూడాలని సూచించారు.
చెక్పోస్టు ఏర్పాటు
మహారాష్ర్ట నుంచి కోళ్ల వెహికిల్స్రవాణా కాకుండా చూసేందుకు చెక్పోస్టు ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాకు బార్డర్లో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉంది. మద్నూర్ మండలం సలావత్పూర్ వద్ద వెటర్నరీ అధికారులు చెక్ పోస్టు ఏర్పాటు చేయనున్నారు.
వైరస్ వ్యాపించకుండా చర్యలు
కోళ్లకు వైరస్ వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. మహారాష్ర్ట, ఛత్తీస్ గఢ్ లో వైరస్తో కోళ్లు చనిపోతున్నాయి. ఇక్కడ అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తున్నాం. మన జిల్లాకు మహారాష్ర్ట బార్డర్లో ఉన్న దృష్ట్యా అక్కడి నుంచి కోళ్ల రవాణా కాకుండా చెక్ పోస్టు ఏర్పాటు చేస్తాం. పౌల్ట్రీ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. - డాక్టర్ సంజయ్కుమార్, వెటర్నరీ జిల్లా అధికారి