జేఈఈ మెయిన్​లో విజ్ఞాన్ విజయ పరంపర

జేఈఈ మెయిన్​లో విజ్ఞాన్ విజయ పరంపర

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ రిజల్ట్ లో తమ సంస్థకు చెందిన స్టూడెంట్లు ఆల్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ర్యాంకులు సాధించారని 'విజ్ఞాన్' విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ వెల్లడించారు. శనివారం ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ మాట్లాడుతూ..తమ వద్ద ఐఐటీ -జేఈఈ మెయిన్స్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్లలో  50 శాతం మంది 90 శాతం పర్సంటైల్ సాధించారని వెల్లడించారు. 

ఇందులో వై. విష్ణుకార్తీక్ (99.45), ఆర్. శ్రీకాంత్ (98.38), కే. విష్ణు వర్ధన్ (98.05), ఎం. ఉమేశ్ (97.01), ఎస్.ప్రేమ్ సాగర్ (96.33), ఏ. రిక్యిత్ (96.30), ఎస్డీ. అర్షద్(96.29) ఎస్కే ఎంరోజ్ బాష (96.13)లు ఉత్తమ పర్సంటైల్ తో రాణించారని వివరించారు. గత 48 ఏండ్లుగా పరిమిత సంఖ్యలో ప్రవేశాలు కల్పిస్తూ ప్రతి ఒక్క విద్యార్థి విజయమే లక్ష్యంగా సంస్థను నిర్వహిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు తాము అందజేస్తున్న అత్యున్నత స్థాయి విద్యా విధానం వల్లనే విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని చెప్పారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులందరిని విజ్ఞాన్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య, వడ్లమూడి, గుంటూరు మహిళల జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ జే. మోహన్ రావు, వై వెంకటేశ్వరరావు, కాలేజీ అధ్యాపకులు అభినందించారు.