
- వికారాబాద్జిల్లాలో ఎగ్జామ్స్రాయనున్న 12,903 స్టూడెంట్లు
- వివరాలు వెల్లడించిన కలెక్టర్.. అధికారులకు దిశానిర్దేశం
వికారాబాద్, వెలుగు: వికారాబాద్జిల్లాలో 12,903 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని కలెక్టర్ప్రతీక్జైన్ తెలిపారు. వీరిలో 6,450 మంది బాలురు, 6,453 మంది బాలికలు ఉన్నారన్నారు. మొత్తం 69 సెంటర్లలో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ నెల 21న మొదలైన ఏప్రిల్3న పరీక్షలు ముగుస్తాయని, అప్పటివరకు పరీక్షల కోసం నియమించిన సిబ్బందికి సెలవులు ఉండవన్నారు. ప్రతిరోజు ఉదయం 9:30కు ఎగ్జామ్మొదలవుతుందని, ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా స్టూడెంట్లను పరీక్షా కేంద్రంలోనికి అనుమతించాలని స్పష్టం చేశారు. ఎగ్జామ్సెంటర్లోని ఏ ఒక్కరి దగ్గరా మొబైల్ఫోన్ఉండకూడదని, ఏఎన్ఎంల దగ్గర కూడా మొబైల్ ఉండడానికి వీలు లేదన్నారు. సందేహాల కోసం కంట్రోల్రూమ్08416 235245కు కాల్ చేయొచ్చని తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో 249 సెంటర్లు..
రంగారెడ్డి కలెక్టరేట్: రంగారెడ్డి జిల్లాలో ఈసారి 51,766 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. 249 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం కలెక్టరేట్నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. సెంటర్లలో ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బుధ, గురువారాల్లో సెంటర్లను తనిఖీ చేయాలని ఆదేశించారు.