2047లోపు అభివృద్ధి చెందిన భారత్ దిశగా ముందుకు పోతున్నం: మంత్రి బీఎల్​ వర్మ

2047లోపు అభివృద్ధి చెందిన భారత్ దిశగా ముందుకు పోతున్నం: మంత్రి బీఎల్​ వర్మ

హనుమకొండ, వెలుగు: అట్టడుగు వర్గాల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఇందులో భాగంగా 2047 లోపు అభివృద్ధి చెందిన భారత్​గా నిలవడమే లక్ష్యంగా  ముందుకు పోతున్నామని కేంద్ర సహకార శాఖ మంత్రి బీఎల్​ వర్మ అన్నారు. వికసిత్​ భారత్​ సంకల్ప్  యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన వరంగల్  నగరానికి వచ్చారు. ముందుగా హనుమకొండకు చేరుకున్న ఆయనకు జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ  స్వాగతం పలికారు. అనంతరం హనుమకొండ జేఎన్​ఎస్​ గ్రౌండ్​ లో నిర్వహించిన వికసిత్​ భారత్​ సంకల్ప్  యాత్రలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

 ఈ యాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. మనందరి సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం కావాలని ప్రతిజ్ఞ చేయించారు.  ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్  బ్యూరో ఆఫ్​ కమ్యూనికేషన్ కు చెందిన వికసిత్  భారత్  సంకల్ప్  యాత్ర  సమాచార మెటిరీయల్ ను ఆయన  ఆవిష్కరించారు. అనంతరం వివిధ శాఖలు, బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్   కేటాయింపు పత్రాలను అందించారు.