అందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జిపై బైక్​లు మాత్రమే..

అందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జిపై బైక్​లు మాత్రమే..

కాగజ్ నగర్, వెలుగు: కోట్ల రూపాయలు పెట్టి అందెవెల్లి పెద్దవాగు మీద బ్రిడ్జి రిపేర్లు చేపట్టినా ఇప్పుడు ఆ బ్రిడ్జి మీద కేవలం బైక్ మాత్రమే అనుమతి ఇస్తున్నారు. వానలకు బ్రిడ్జి చివర అప్రోచ్ రోడ్డుకు వేసిన మొరం కోతకు గురైంది.

దీంతో  పోలీసులు  కేవలం బైక్​లను మాత్రమే దాటేందుకు అనుమతిస్తున్నారు. ఇతర వాహనాలను తిప్పి పంపిస్తున్నారు. మొరం, కంకర ఎక్కువ పోసి ఆటోలు, ఇతర వాహనాలకు అనుమతించాలని ప్రజలు కోరుతున్నారు.