డివైడర్ పనులు అడ్డుకున్న గ్రామస్తులు

డివైడర్ పనులు అడ్డుకున్న గ్రామస్తులు
  •     యూటర్న్​ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్​

కోల్ బెల్ట్​,వెలుగు : మంచిర్యాల- మందమర్రి నేషనల్​ హైవే విస్తరణలో భాగంగా చేపట్టిన డివైడర్ల నిర్మాణ పనులను క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి కొత్త తిమ్మాపూర్ గ్రామస్తులు అడ్డుకున్నారు. శనివారం గద్దెరాగడి -కొత్త తిమ్మాపూర్​మధ్య నిర్మాణ పనులు చేస్తుండగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. నేషనల్​ హైవేకు ఇరువైపులా రోడ్డు దాటేందుకు కొత్త తిమ్మాపూర్​ వెళ్లే మార్గం వద్ద యూటర్న్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  తమ సమస్యను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి దృష్టికి తీసుకవెళ్లామన్నారు.  

ఆయన సానుకూలంగా స్పందించి యూటర్న్​ ఇచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. కానీ హైవే అథారిటీ ఆఫీసర్లు హడవిడిగా డివైడర్​ను నిర్మించే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.  తమ సమస్య పరిష్కారించకపోతే నిర్మాణపనులు జరగనీయబోమన్నారు. ఈ సందర్భంగా  డివైడర్​ పనులను అడ్డుకొని రోడ్డుపై కూర్చుని నిరసనకు దిగారు. దీంతో పనులు చేపట్టిన సిబ్బంది అక్కడి నుంచి  వెళ్లిపోయారు.