వైద్యసేవల కోసం గ్రామస్తుల ధర్నా

వైద్యసేవల కోసం గ్రామస్తుల ధర్నా

సదాశివనగర్, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్​ మండలంలోని ఉత్తునూర్​ గ్రామంలో సర్కార్​ దవాఖాన ముందు బుధవారం వీడీసీ అధ్యక్షుడు దొడ్డె నరేందర్ రావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా నరేందర్ రావు మాట్లాడుతూ.. ఉత్తునూర్​ సర్కార్​ దవాఖానకు వైద్యురాలు రాకపోవడంతో రోగులు ఇబ్బందులుపడుతున్నారన్నారు.  వ్యాధులబారిని పడిన రోగులు ప్రభుత్వ హాస్పిటల్​లో వైద్యం అందక ప్రైవేట్​దవాఖానకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. 

జిల్లా వైద్యాధికారి మరొక డాక్టర్ ను ఏర్పాటు చేయకుండా రోగుల ప్రాణాలతో చేలగాటమాడుతున్నారని మండిపడ్డారు.  రెండు రోజులలో డాక్టర్ ను  నియమించాలని లేకుంటే  జిల్లా వైద్యాధికారి ఆఫీస్​ ముందు గ్రామస్తులతో కలిసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో మాజీ సర్పంచ్​ మోతే సాయవ్వ రాములు, నారాయణగౌడ్, వాగుమారి రాజేందర్, గుడ్ల భూంరావు, అరిగే గణేశ్, సాయిలు, నర్సయ్య, నరేశ్​ గౌడ్​ గ్రామస్తులు పాల్గొన్నారు.