ఇథనాల్​ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ఆందోళన

ఇథనాల్​ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ఆందోళన

బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో గ్రీన్ వేస్ బయో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును ఆపాలని మండలంలోని  పోతారం, నరసింహుల పల్లె, రెడ్డి గుంటపల్లి గ్రామస్తులు ఆందోళన చేశారు.

గురువారం తహసీల్దార్​ఎర్రోళ్ల శ్యామ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ..పోతారం గ్రామంలోని 15 ఎకరాలతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభించారని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని ఆరోపించారు. వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపేయాలని డిమాండ్​ చేశారు.