పెండింగ్ పనులకు నిధులివ్వండి : వినయ్ రెడ్డి

పెండింగ్ పనులకు నిధులివ్వండి : వినయ్ రెడ్డి
  • మంత్రి సీతక్కను కోరిన వినయ్ రెడ్డి

​నందిపేట, వెలుగు: నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో అసంపూర్తిగా ఉన్న పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్​ పార్టీ ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్‌‌చార్జి  పొద్దుటూరి వినయ్​రెడ్డి ఆదివారం హైదరాబాద్​లో మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు.​  

మండలంలోని కౌల్‌‌పూర్‌‌‌‌ గ్రామంలో ఎస్సీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పొడిగింపునకు రూ. 50 లక్షలు, మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న గౌడ ఫంక్షన్​హాల్​ నిర్మాణ పనులకు రూ. 25 లక్షలు, పద్మశాలీ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు రూ. 25 లక్షలు, మైనార్టీ ఫంక్షన్​హాల్‌‌కు రూ. 25 లక్షలు మంజూరు చేయాలని కోరారు.  దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారని త్వరలోనే నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు వినయ్ రెడ్డి తెలిపారు.