Virat Kohli: లండన్‌లో కోహ్లీ, అనుష్క శర్మ.. కృష్ణ దాస్ కీర్తనకు హాజరైన విరుష్క జోడీ

Virat Kohli: లండన్‌లో కోహ్లీ, అనుష్క శర్మ.. కృష్ణ దాస్ కీర్తనకు హాజరైన విరుష్క జోడీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన ఫ్యామిలితో హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన  తర్వాత ముంబైలో విజయ పరేడ్ లో పాల్గొన్న కోహ్లీ.. ఆ మరుసటి రోజే లండన్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీ గురించి అతను భార్య అనుష్క శర్మ అప్ డేట్ ఇచ్చారు. విరాట్ కోహ్లి, అతని భార్య అనుష్క శర్మ శనివారం (జూలై 13) లండన్‌లో అమెరికన్ గాయకుడు కృష్ణ దాస్ కీర్తనకు హాజరైనట్లు తెలుస్తోంది. 

యూనియన్ చాపెల్‌లో జరిగిన కార్యక్రమానికి ఇద్దరూ హాజరయ్యారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోను అనుష్క శర్మ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో విరుష్క జోడీ ఈ కీర్తనలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కృష్ణ దాస్‌ని ట్యాగ్ చేస్తూ న్యూయార్క్ టైమ్స్ "అమెరికన్ యోగా చాంట్ మాస్టర్"గా అతన్ని అభివర్ణించింది. ఈ జోడీ కృష్ణ దాస్ కీర్తననలకు హాజరవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ లండన్ కు వెళ్ళినప్పుడు వీరు ఈ కార్యక్రమంలో తళుక్కున మెరిశారు. కృష్ణ దాస్ 1996 నుండి పదిహేడు ఆల్బమ్‌లను విడుదల చేశారు.

ప్రస్తుతం టీమిండియా జింబాబ్వే పర్యటనలో టీ20 సిరీస్ ఆడుతోంది. ఆదివారం (జూలై 14)తో ఈ సిరీస్ ముగుస్తుంది. జూలై నెలాఖరులో భారత్ శ్రీలంక టూర్ కు వెళ్లాల్సి ఉంది. ఈ సిరీస్ కు కోహ్లీతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సిరీస్ కు కోహ్లీకు రెస్ట్ ఇస్తే అతను సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడు.