ఇంగ్లాండ్తో జరుగుతోన్న మూడో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకట్టుకున్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమి సమస్యతో పరుగులు చేయడానికి తంటాలు పడుతోన్న కోహ్లీ ఈ మ్యాచ్లో తిరిగి గాడినపడ్డాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతోన్న వన్డేలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. తన శైలీకి భిన్నంగా క్రీజ్లోకి వచ్చి రావడంతోనే రన్ మెషిన్ దూకుడు ప్రదర్శించాడు.
ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 50 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా వన్డే ఫార్మాట్లో 73 హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. కోహ్లీ క్రీజ్లో కుదురుని హాఫ్ సెంచరీ చేయడంతో విరాట్ అభిమానులు ఖుష్ అయ్యారు. క్రీజ్లో కోహ్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా యథేచ్చగా ఆడుతుండటంతో ఇవాళ సెంచరీ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. కానీ ఫ్యాన్స్ ఆశలు నిమిషాల్లోలనే అడియాశలు అయ్యాయి. హాఫ్ సెంచరీ చేసిన కాసేపటికే కోహ్లీ (55) ఔట్ అయ్యాడు.
Also Read :- సంజు శాంసన్కు సర్జరీ
ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ఆదిల్ రషీద్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించగా.. బాల్ ఔట్ సైడ్ ఎడ్జ్ తీసుకుని కీపర్ ఫిల్ సాల్ట్ చేతిలో పడింది. దీంతో తీవ్ర నిరాశతో కోహ్లీ క్రీజ్ను వీడాడు. ‘‘సెంచరీ చేస్తావనుకుంటే ఎంత పని చేశావన్నా’’ అంటూ కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాధను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెంచరీ మిస్ అయినా.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ టచ్లోకి రావడం భారత్కు శుభపరిణామని పేర్కొంటున్నారు.
💔 Virat Kohli departs! 😞🏏
— Chaitan Majhi (@ChaitanMajhiIND) February 12, 2025
18.6 | Adil Rashid strikes! ✨ Gets Kohli for the 5th time in ODIs.
Kohli c Philip Salt b Rashid 52(55) [4s-7 6s-1]
A solid knock comes to an end! 👏🔥#ViratKohli #KingKohli #INDvENG #Cricket #TeamIndia pic.twitter.com/UqKTct6e5R
ఇక, మూడు మ్యాచుల వన్డే సిరీస్ను 2-0 తేడాతో ఇప్పటికే భారత్ కైవసం చేసుకుంది. చివరి నామామాత్రపు మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. మరోవైపుఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ మ్యాచులో విజయం సాధించి.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫికీ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలను ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.