Virat Kohli: విరాట్ బై బై.. లండన్‌కు బయలుదేరిన కోహ్లీ

Virat Kohli: విరాట్ బై బై.. లండన్‌కు బయలుదేరిన కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ కు బయలుదేరాడు. గురువారం(జూలై 4) ముంబైలోని వాంఖడేలో విక్టరీ పరేడ్  సెలెబ్రేషన్స్ తర్వాత కోహ్లీ లండన్ కు బయలుదేరుతున్నట్టు కనిపించాడు. విరాట్ తన భార్య అనుష్క శర్మ.. పిల్లలు వామిక, అకాయ్ కోహ్లీతో కలిసి హాలీ డే ట్రిప్ కు లండన్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కోహ్లి ముంబై విమానాశ్రయంలో కనిపించడం.. టెర్మినల్ 2 యొక్క డిపార్చర్ గేట్‌లోకి ప్రవేశించిన వీడియో వైరల్ అవుతోంది. ఐపీఎల్, వరల్డ్ కప్ లో రెస్ట్ లేకుండా ఆడిన కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి చిన్నపాటి విరామం తీసుకోనున్నాడు.   

అంతర్జాతీయ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లకు అవకాశమివ్వాలనే  కోహ్లీ టీ20 ల నుంచి తప్పుకున్నట్టు తెలిపాడు. టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో విఫలమైన కోహ్లీ.. ఫైనల్లో సౌతాఫ్రికాపై అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 59 బంతుల్లో76 పరుగులు చేసి భారత్ ను ఆదుకున్నాడు. విరాట్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి. ఒకదశలో భారత్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్, శివమ్ దూబేలతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 176 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.

కోహ్లీతో పాటు బౌలర్లు సమిష్టిగా రాణించడంతో సౌతాఫ్రికాపై జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచి రెండో టీ20 వరల్డ్ కప్ అందుకుంది. కోహ్లీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో కోహ్లీ గ్రాండ్ గా తన అంతర్జాతీయ టీ20 కెరీర్ ను ముగించాడు. టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. ఈ టూర్ లో సీనియర్లకు రెస్ట్ ఇచ్చారు. జూలై నెలాఖరులో శ్రీలంకపై వన్డే సిరీస్ కు కోహ్లీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.