
హైదరాబాద్సిటీ, వెలుగు: గడువు తీరిన వీసాతో హుమాయున్నగర్లో తిరుగుతున్న ఓ నైజీరియన్ ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్వింగ్ ఆదివారం స్వదేశానికి పంపింది. నైజీరియాకు చెందిన సిల్వెస్టర్ 2012లో ముంబైకి వచ్చి అక్కడి నుంచి తన దేశానికి బట్టలు ఎక్స్పోర్ట్చేసేవాడు. హైదరాబాద్లో తన మిత్రులను కలవడానికి వచ్చి ఫిబ్రవరి 5న హుమాయున్ నగర్ పీఎస్పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా తనిఖీ చేశారు. వీసా గడువు ముగిసినట్టు తేలడంతో అదుపులోకి తీసుకుని నైజీరియాకు పంపించారు.