‘విశ్వం’ చిత్రాన్ని మౌత్ టాక్తో సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు గోపీచంద్. శ్రీనువైట్ల దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్మీట్లో గోపీచంద్ మాట్లాడుతూ ‘దసరాకి రిలీజైన ఈ సినిమాకి మొదటి రోజు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు అందరికీ రుణపడి ఉంటాను.
థియేటర్లో ఆడియెన్స్ ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ల నవ్వులు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’ అని చెప్పాడు. శ్రీనువైట్ల మాట్లాడుతూ ‘ఇంత సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్యూ. విడుదలైన రెండో రోజే మూడు రెట్లు రెవెన్యూ వసూలు చేసింది. వీక్ డేస్లో కూడా అదే కంటిన్యూ అవుతోంది.
ఈ విజయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అని అన్నాడు. నటులు నరేష్, పృథ్వీ, అనిషా అంబ్రోస్ ఈ సక్సెస్లో పార్ట్ అవడం ఆనందంగా ఉంది అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్, డీవోపీ గుహన్, ఎడిటర్ అమర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.