
‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ అవినీతిని రాహుల్ గాంధీ కక్కిస్తా అన్నడు.. సుమన్ అవినీతిని మనం కక్కిద్దాం.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ సాధించుకుంటే... కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిండు. డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని పేదలను మోసం చేసిండు. ఆయన ఇంట్లో మాత్రం ఆరు ఉద్యోగాలు ఇచ్చుకున్నడు.
నెలకు రూ.50 లక్షల జీతం తీసుకుంటున్నరు. కేసీఆర్ సొంతూరులో ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చిండు. కేసీఆర్ చిన్నకొడుకు ఇలాక చెన్నూరులో ఎందుకు ఇవ్వలేదు? కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. రోడ్లు, ఇతర మౌలిక సౌలతులకు పైసలు పెట్టకుండా కమీషన్ వస్తదని కాళేశ్వరానికి ఫండ్స్ మళ్లించిండు. కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకు కట్టబెట్టిండు. 5 లక్షల కోట్ల అప్పు చేసి పుట్టిన బిడ్డ మీద కూడా రుణ భారం మోపిండు.
‘బాల్క సుమన్ ఇంట్లో గోడకు తుపాకీ ఉంటది.. అది అవసరం ఉన్నపుడు తీస్తా అని అంటున్నడు. పాపం మనం సుమన్కు తుపాకీ కాల్చే అవకాశం ఇవ్వాలే. ఈ నెల 30న జరిగే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించాలే. ఆ తర్వాత మెట్పల్లిలో గల్లీల్లో తుపాకీ పట్టుకొని పిట్టలను కాల్చుకుంటూ తిరిగే అవకాశం కల్పించాలే’
ALSO READ :- సీఎం ఇంట్లోనే ఉద్యోగాలు వచ్చాయి : చెన్నమనేని వికాస్రావు