
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో మిడ్ రేంజ్5జీ ఫోన్ వై 29 ను లాంచ్ చేసింది. ఇందులో 6.68 ఇంచుల స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, వెనుక రెండు కెమెరాలు, 8జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజీ ఉంటాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ధరలు రూ.14 వేల నుంచి రూ.19 వరకు ఉంటాయి. కొన్ని కార్డులతో కొంటే రూ.1,500 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.