వొయిలర్​మోటార్స్..​తెలుగు రాష్ట్రాల్లో10 ఔట్​లెట్లు

వొయిలర్​మోటార్స్..​తెలుగు రాష్ట్రాల్లో10 ఔట్​లెట్లు

హైదరాబాద్​, వెలుగు: కమర్షియల్​ ఎలక్ట్రికల్ ​వెహికల్స్​తయారు చేసే ఢిల్లీ కంపెనీ వొయిలర్​ మోటార్స్​విస్తరణ బాట పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో పది ఔట్​లెట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. హైదరాబాద్​లో ఇది వరకే మూడు ఔట్​లెట్లు ఉన్నాయని, కరీంనగర్​, వరంగల్​ సహా పలు నగరాల్లో కొత్తవి ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 

హైదరాబాద్​లో గురువారం కంపెనీ బిజినెస్​, సేల్స్ వీపీ వాణి మెహ్రా మీడియాతో మాట్లాడుతూ ‘‘మేం ప్రస్తుతం ఒక త్రీవీలర్​, ఒక ఫోర్​వీలర్​ అమ్ముతున్నాం.  త్రీవీలర్​ ధర రూ.4.43 లక్షలు కాగా, 4 వీలర్​ ధరలు రూ.9.20 లక్షల నుంచి రూ.14.15 లక్షల వరకు ఉంటాయి. త్రీ వీలర్​ 120 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 4 వీలర్​ లాంగ్​రేంజ్​200 మోడల్​ 200 కిలోమీటర్లు, టీ1250 మోడల్​ 140 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 

మాకు హర్యానాలో ప్లాంటు ఉంది. దక్షిణాదిలోనూ ప్లాంటు పెట్టేఆలోచన ఉంది. తయారీ సామర్థ్యాలను పెంచడానికి రూ.100 కోట్లు ఇన్వెస్ట్​ చేశాం”అని ఆమె వివరించారు.