వీఎస్​హెచ్​ఆర్ఏడీఎస్​ క్షిపణి పరీక్ష విజయవంతం

వీఎస్​హెచ్​ఆర్ఏడీఎస్​ క్షిపణి పరీక్ష విజయవంతం

నాలుగో తరం స్వల్పశ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ(వెరీ షార్ట్​ రేంజ్​ ఎయిర్​ డిఫెన్స్​ సిస్టమ్​ మిస్సైల్​ – వీఎస్​ హెచ్​ఆర్​ఏడీ ఎస్​)ను భారత్​ రాజస్థాన్​లోని ప్రోఖ్రాన్​ ఫైరింగ్​ రేంజ్ వద్ద ఒకే రోజు మూడుసార్లు విజయవంతంగా పరీక్షించింది. ఈ అధునాతన క్షిపణి పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని సైనికులు భుజంపై మోసుకెళ్లగలరు.

హైదరాబాద్​లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ)కు చెందిన రీసెర్చ్​ సెంటర్​ ఇమారత్​ (ఆర్​సీఐ) ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇందులో మినియేచరైజ్డ్​ రియాక్షన్​ కంట్రోల్​ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్​ ఏవియానిక్స్​ ఉన్నాయి.