ఒక్కొక్కరిని చంపబోతున్నాం.. తస్మాత్ జాగ్రత్త: జగిత్యాలలో వాల్ పోస్టర్ల కలకలం

ఒక్కొక్కరిని చంపబోతున్నాం.. తస్మాత్ జాగ్రత్త: జగిత్యాలలో వాల్ పోస్టర్ల కలకలం

జగిత్యాల: మంత్రగాళ్లారా తస్మాత్ జాగ్రత్త.. మంత్రాలు చేసే వాళ్ళని ఒక్కొక్కరిని చంపబోతున్నామంటూ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లు జగిత్యాల జిల్లాలో కలకలం రేపాయి. వివరాల ప్రకారం.. మేడిపల్లి మండలంలోని కట్లకుంట గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిలాఫలకానికి మంత్రాలు చేసేవాళ్లను హెచ్చరిస్తూ వాల్ పోస్టర్లు అంటించారు.  గ్రామంలోని పలానా చోటు నుండి ఇద్దరు వ్యక్తులతో ఈ పని మొదలు పెట్టి.. మిగతా వాడల్లో ఉన్న మంత్రాలు చేసే వారందరినీ చంపేస్తామంటూ వాల్ పోస్టర్‏లో ఎరుపు రంగు అక్షరాలతో రాశారు. 

మంత్రగాళ్లకు సపోర్టు చేసే వారిని కూడా వదిలిపెట్టబోమని.. తాము ప్రజల మంచి కోరే సంస్థకు చెందిన వ్యక్తులమని పోస్టర్‎లో పేర్కొన్నారు. ఈ వాల్ పోస్టర్ వ్యవహరం గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఈ ఘటనపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వాల్ పోస్టర్లు ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారా..? లేక ఎవరైనా ఆకతాయిల చేశారా..? అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం