
హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి హాజరై అభిమానులకు అభివాదం చేశారు. చిరు రాకతో సభ మొత్తం ఈలలు, చప్పట్లతో మారుమ్రోగింది. చిరంజీవి తనయుడు రాంచరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు శంకర్నాయక్, అరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ లీడర్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, నిర్మాత నవీన్, డైరెక్టర్ బాబీ, యాంకర్ సుమ పాల్గొన్నారు.