జర్నలిస్టులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి 

జర్నలిస్టులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి 

వనపర్తి, వెలుగు:  జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై  శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.  మంగళవారం టీయూడబ్ల్యూజే ( ఐజేయూ) ఆధ్వర్యంలో  చిట్యాల గ్రామ శివారులోని దేశినేని శ్యామలమ్మ ఫంక్షన్ హాల్లో  మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ సహకారంతో జిల్లాలోని జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

సంఘం రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నిత్యం వ్యాయామం చేయడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టులు ఈ మెడికల్ క్యాంపు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్​వో  శ్రీనివాసులు, ప్రోగ్రాం​ఆఫీసర్​సాయినాథ్​రెడ్డి, డాక్టర్లు రామచంద్రారావు, దయావాస్వాని, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.