నిబంధనలు​ అతిక్రమిస్తే చర్యలు : డీఎంహెచ్ వో శ్రీనివాసులు

నిబంధనలు​ అతిక్రమిస్తే చర్యలు : డీఎంహెచ్ వో శ్రీనివాసులు
  • పలు ప్రైవేటు హాస్పిటల్స్ లో తనిఖీలు

పెబ్బేరు, వెలుగు: ప్రైవేటు హాస్పిటల్స్​ నిర్వాహకులు, ఆర్ఎంపీలు, పాలీ క్లినిక్​లు నడిపేవారు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వనపర్తి డీఎంహెచ్​వో శ్రీనివాసులు హెచ్చరించారు. పెబ్బేరు పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్స్, ఆర్ఎంపీ, పాలీక్లినిక్​లు, ల్యాబ్​లను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొందరు ఆర్ఎంపీల వద్ద కర్నూల్​కు చెందిన హాస్సిటల్స్​ రెఫరల్​ లెటర్స్​ ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఆయుర్వేద ఆర్ఎంపీ వివిధ రకాల మందులు, సిరప్ లు అక్కడే విక్రయిస్తుండటంతో హెచ్చరించారు.

.ప్రైవేటు క్లినిక్​లు, హాస్సిటల్స్ లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న పేషంట్లతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు. ఓ పైల్స్​క్లినిక్​లో ఆర్ఎంపీ ఓ పేషంట్ కు రెండు యాంటీ బయాటిక్స్​ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వారంలోపు అతని సర్టిఫికెట్లు సబ్​మిట్​చేయాలని ఆదేశించారు. లక్ష్మీమహాదేవ హాస్సిటల్​లో స్కానింగ్​మెషిన్​కు పర్మిషన్​ ఉన్నా.. సంబంధిత డాక్టర్​ లేకపోవడంతో దాన్ని సీజ్​చేశారు. డిప్యూటీ డీఎంహెచ్​వో శ్రీనివాసులు, మాస్​మీడియా ఆఫీసర్​రవి కుమార్​ తదితరులున్నారు.