
కొచ్చి(కేరళ): వక్ఫ్ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమనే అధికారం ఏ రాష్ట్రానికీ లేదని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్రిజిజు స్పష్టం చేశారు. పాత తప్పులను కరెక్ట్చేసేందుకే వక్ఫ్సవరణ చట్టం తీసుకొచ్చామని తెలిపారు. ముస్లింలను ఎక్కడా టార్గెట్చేయలేదని, పేద ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకే సవరణ చేశామని క్లారిటీ ఇచ్చారు.
మంగళవారం కేరళలోని కొచ్చిలో కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎవరూ మరొక వ్యక్తి ఆస్తులను బలవంతంగా, ఏకపక్షంగా స్వాధీనం చేసుకోలేరని చాటడమే కేంద్రం ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ చట్టం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొస్తుందని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం, అక్రమ ఆక్రమణలను నిరోధించడంతో పాటు ఈ ఆస్తులను సమాజహితం కోసం సమర్థవంతంగా ఉపయోగించేలా చర్యలు తీసుకోవడమే చట్టం ఉద్దేశమని తెలిపారు.
వక్ఫ్ అల్లర్ల వెనక భూకబ్జాదారులు
వక్ఫ్ అల్లర్ల వెనుక భూకబ్జాదారులు ఉన్నారని కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ చట్టంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తప్పుడు సమాచారం ప్రచారంచేస్తూ, ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఈ బిల్లు ఏ ఒక్క సముదాయాన్ని లక్ష్యంగా చేసుకున్నది కాదని, బదులుగా వక్ఫ్ వ్యవస్థను బలోపేతం చేసి, దాని ద్వారా సమాజంలోని అవసరమైన వర్గాలకు మెరుగైన సేవలు అందించడమే దీని లక్ష్యమని స్పష్టంచేశారు. ఈ చట్టం ముస్లిం సమాజంతో సహా సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడుతుందని తెలిపారు.