![బిల్ట్ సమావేశంలో రభస.. పీఎఫ్ ,నాన్ పీఎఫ్ లీడర్ల వాగ్వివాదం](https://static.v6velugu.com/uploads/2024/07/war-of-words-between-pf-and-non-pf-leaders-at-build-meeting_IceDVJyC4Z.jpg)
- మీటింగ్కు హైకోర్టు లాయర్లు హాజరు
మంగపేట: ములుగు జిల్లాలోని మంగపేట మండలం కమలాపురం బిల్ట్ కార్మికులకు జరిగిన అన్యాయం పై నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. కార్మికులకు రావాల్సిన వేతనాల గురించి, వారి సమస్యలను తెలుసుకోవడానికి లాయర్లు సమావేశం ఏర్పాటు చేశారు.బిల్ట్ కార్మికుల సమస్యలను తెలుసుకోవటానికి సమావేశానికి హైకోర్టు లాయర్లు హాజరయ్యారు.
కార్మికులు తమ సమస్యలను వివరిస్తుండగా ఒక్కసారిగా గొడవ ప్రారంభమైంది. పీఎఫ్, నాన్ పీఎఫ్ లీడర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు వాదించుకోవడంతో గందరగోళం నెలకొంది.