టెన్త్​లో 10/10 జీపీఏ సాధిస్తే దావతిస్తా

టెన్త్​లో 10/10 జీపీఏ సాధిస్తే దావతిస్తా

నర్సంపేట, వెలుగు: టెన్త్​లో 10/10 జీపీఏ సాధించిన స్టూడెంట్లకు దావతిస్తానని వరంగల్​ కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ ​జిల్లా చెన్నారావుపేట ప్రైమరీ స్కూల్​లో ఆర్టీఫిషియల్​ ఇంటలిజెన్స్​ ద్వారా బోధనను కలెక్టర్ శనివారం ప్రారంభించారు.

అనంతరం హైస్కూల్​ టెన్త్​సెంటర్​ను పరిశీలించి పరీక్ష రాయనున్న స్టూడెంట్లతో మాట్లాడారు. టెన్త్​లో 10/ 10 జీపీఏ సాధించేందుకు స్టూడెంట్లు కష్టపడాలని సూచించారు. పైలట్​ప్రాజెక్టు కింద వరంగల్​జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ పాఠశాల్లలో ఏఐ బోధనను ప్రారంభించినట్లు తెలిపారు. దీనిపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.