![మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు : సీపీ అంబర్ కిషోర్ ఝా](https://static.v6velugu.com/uploads/2025/02/warangal-cp-amber-kishore-jha-says-strict-action-will-be-taken-against-illegal-mining-mafia_QpOz3I01t6.jpg)
వర్ధన్నపేట, వెలుగు : అక్రమ మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. వరంగల్జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, కొత్తపల్లి గ్రామాల్లోని ఆకేరు వాగు పరివాక ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను ఆయన పరిశీలించారు. సీఐ శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సీపీ మీడియాతో మాట్లాడుతూ అక్రమ మైనింగ్ జరుగకుండా స్పెషల్ టీంను ఏర్పాటు చేస్తామని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచుతామన్నారు. సీపీ వెంట ఏసీపీ నర్సయ్య, ఎస్సై చందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మత్తుకు బానిసై భవిష్యత్ను చిత్తు చేసుకోవద్దు
కాశిబుగ్గ(కార్పొరేషన్): యువత మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్ను చిత్తు చేసుకోవద్దని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. బుధవారం తెలంగాణ స్టేట్ జర్మలిస్ట్ యూనియన్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పోచమ్మమైదాన్ నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు 2కే రన్ నిర్వహించారు.
కార్యక్రమాన్ని సీపీ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, టీఎస్ జేయూ రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం నారగోని, ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, జాతీయ కార్యదర్శి మెరుగు చంద్రమోహన్తో కలిసి ప్రారంభించారు.