పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యే : సీపీ రంగనాథ్ 

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యే : సీపీ రంగనాథ్ 

వరంగల్‌ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిది ఆత్మహత్యే అని వరంగల్ సీపీ రంగనాథ్ చెప్పారు. ప్రీతి పోస్టుమార్టం రిపోర్టు తమకు వచ్చిందని, వారం పది రోజుల్లో చార్జిషీటు వేస్తామన్నారు. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ మెడికో సైఫే కారణం చెప్పారు. 

ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ సైఫ్‌కు బెయిల్‌ మంజూరైంది. రెండు నెలలుగా ఖమ్మం జిల్లా జైలులో రిమాండులో ఉన్న సైఫ్‌కు బుధవారం (ఏప్రిల్ 19న) షరతులతో కూడిన బెయిల్‌ మంజూరైంది. అయితే.. పూచీకత్తు, సంతకాల విషయంలో జాప్యం జరగడంతో విడుదల ఆలస్యమైంది. సాధారణ కోర్టు వాయిదా ఉండడంతో సైఫ్‌ని పోలీసులు గురువారం (ఏప్రిల్ 20న) వరంగల్‌ కోర్టులో హాజరుపరిచారు. బెయిల్‌ ఉత్తర్వుల కాపీ వరంగల్‌ కోర్టు నుంచి గురువారం సాయంత్రం రావడంతో సైఫ్‌ను కోర్టు నుంచి ఖమ్మం జైలుకు తీసుకు వచ్చి సంతకాలు తీసుకుని సాయంత్రం ఆరుగంటల సమయంలో సైఫ్‌ను విడుదల చేశారు.