
- వరంగల్ సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ వెల్లడి
హనుమకొండ, వెలుగు: ప్రముఖ హెచరీస్సంస్థలో గుమస్తాకు ఓనర్ పేరున మెసేజ్చేసి రూ.కోటిన్నరకుపైగా కొట్టేసిన సైబర్మోసగాడిని వరంగల్ సైబర్ క్రైమ్పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ సైబర్ క్రైమ్ స్టేషన్ ఇన్చార్జ్ డీఎస్పీ ఫణిందర్ మంగళవారం వివరాలను మీడియాకు తెలిపారు. యూపీలోని ప్రతాప్ గఢ్జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్(39) హనుమకొండలోని ఓ ప్రముఖ హెచరీస్సంస్థలోని గుమస్తాకు గత నెల 19న వాట్సాప్మెసేజ్పంపాడు. సంస్థ ఓనర్ ను అని , ఇది కొత్త ఫోన్ నంబర్ అని.. సేవ్ చేసుకోవాల్సిందిగా మెసేజ్ లో తెలిపాడు.
నమ్మిన గుమస్తా సేవ్ చేసుకోగా.. కొద్దిరోజుల కింద ప్రదీప్కుమార్వాట్సప్ కాల్ చేశాడు. ఎక్కడ ఉన్నావ్.. ఎలా ఉన్నావ్అనే వివరాలు అడిగి.. సంస్థ అకౌంట్ నుంచి తను చెప్పిన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్చేయాలని సూచించాడు. దీంతో గుమస్తా అవతలి వ్యక్తి చెప్పినట్టుగా రెండుసార్లు రూ.1.68 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. మరోసారి ఫోన్ రాగా గుమస్తా అనుమానించాడు. ఓనర్పర్సనల్నంబర్ కు ఫోన్చేసి ఆరా తీశాడు.
దీంతో మోసపోయినట్టు తెలుసుకుని ఓనర్ తోపాటు గుమస్తా వెంటనే వరంగల్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టి, టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సోమవారం రాత్రి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. నిందితుడి పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సైబర్ క్రైమ్స్ సీఐ యాసిన్, ఎస్ ఐలు చరణ్, శివ, సిబ్బందిని డీఎస్పీ ఫణిందర్అభినందించారు.