వరంగల్ జిల్లాలో భారీ చోరీ.. 8తులాల బంగారం.. రూ. 70 వేలు అపహరణ

వరంగల్ జిల్లాలో భారీ చోరీ.. 8తులాల బంగారం.. రూ. 70 వేలు అపహరణ

వరంగల్​ జిల్లా లో దొంగలు రెచ్చిపోయారు. వరంగల్​ రాంకీలో  ఓ ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో సామాను చిందరవందర చేసి బీరువా లాకర్​ పగులకొట్టి 8తులాల బంగారం 70 వేల రూపాయిలను అపహరించారు. ఇంటి యజమాని నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈ చోరీ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. .