ఎంజీఎంలో కరెంట్​ కట్ వెంటిలేటర్లు, ఏసీలు పనిచేయక ఇబ్బంది

ఎంజీఎంలో కరెంట్​ కట్ వెంటిలేటర్లు, ఏసీలు పనిచేయక ఇబ్బంది

వరంగల్​సిటీ, వెలుగు: వరంగల్​ ఎంజీఎం దవాఖానలో టెక్నికల్​ ఇష్యూతో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి కరెంట్​  కట్​ కావడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఓపీతో పాటు ఐసీయూ, ఆర్ఐసీయూ, గుండె జబ్బుల వార్డు, ఆపరేషన్​ థియేటర్లు, ఈఎన్టీ, ఆర్థోపెడిక్​ వార్డు, పిల్లల వార్డులోని ఎన్ఐసీయూ, పీఐసీయూ విభాగాల్లో  కరెంట్​ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్  సాయంతో లైట్లు, ఫ్యాన్లు పనిచేయడంతో ఊరట చెందారు. విద్యుత్​ శాఖాధికారులు, సిబ్బంది సమస్యను పరిష్కరించడంతో రాత్రి 9 గంటలకు  కరెంట్​ వచ్చింది.